అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) 17వ జాతీయ మహాసభల ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ అన్నారు. ఈ సందర్భంగా టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే నెల 15 నుండి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసం అఖిలభారతి యువజన సమాఖ్య అలు పెరగని పోరాటం చేస్తుందని, ఆయన అన్నారు.భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వలేదని తక్షణమే నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుపతి వేదిక గా జరుగుతున్న జాతీయ మహాసభలలో అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ నాయకులు గోవింద్, మోహన్, కార్తీక్ తదితరులు హాజరైనారు.
