
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్ర పురం గ్రామ పంచాయతీ సాలిపేట గ్రామానికి చెందిన మార్పు భూషణ్ రావు కు సంబంధించిన రెండు ఎకరాల వరి చేను నూర్చుతుండగా ఆగ్నిప్రమాదం సంభవించింది.బల్లి అప్పారావు & మహేష్ ట్రాక్టర్ , నూర్పు మిషను అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈ
విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదంలో ట్రాక్టర్ కాలిపోయి నష్టపోయిన బల్లి అప్పారావు, మహేష్ కుటుంబానికి , మరియు వరి చేను దగ్ధమై నష్టపోయిన మార్పు నాగభూషణరావు కుటుంబానికి పరామర్శించి ఒక్కోక్క కుటుంబానికి 10000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో పేరాడ తిలక్ అందజేశారు. ఈయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు హేమ సుందర్ రాజు జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు , బి సి సెల్ అధ్యక్షులు పేడాడ వెంకట్రావు స్థానిక సర్పంచ్ గురువెల్లి కేశవరావు యం పి టీ సి బగాతి దివాకర్ రావు యం పి టీ సి పూజారి సత్యం సర్పంచులు, కాళ్ల సంజీవరావు ,సుంకర జనార్దన్ రావు , వైస్ సర్పంచ్ తర్ర రమణారావు కృష్ణమూర్తి ,మెట్ట అప్పలనాయుడు గుంట సోమేశ్వరరావు, బల్లి అప్పారావు,గ్రామస్థులు కార్య కర్తలు పాల్గొన్నారు.