భవణ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను పునరుద్ధరించాలి

AP Political News Trending

టెక్కలిలో జిల్లా సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల తో ధర్నాను చేపట్టారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరంతా సంక్షేమ బోర్డు లో సభ్యులుగా ఉంటూ రుసుము చెల్లించి ఉన్నారని, కార్మికుల డబ్బులు ప్రభుత్వం ఖర్చు చేసుకుని, నిర్మాణ కార్మికుల సంక్షేమం విడచి పెట్టారని ఆరోపించారు. తక్షణం మే పెండింగ్ క్లెయిమ్ లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమంపై దృష్టి సారించాలని కోరుతూ టెక్కలి లో భవణ నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. టెక్కలి లేబర్ఆపీసు లో సంబంధితఅధికారుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మెమోరండం సమర్పించినట్లుతెలిపారు .టెక్కలి భవణ నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు గూన త్రినాథ్, తిర్లంగి అప్పన్న,దవల లక్ష్మీనారాయణ,,కొర్రాయి ఆనంద్, సత్తారు ఉత్తర తదితర లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *