
రైతు బాంధవుడు స్వర్గీయ కిల్లి అప్పలనాయుడు నేటి జయంతి సందర్భముగా డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జర్నలిస్టు విభాగము డాక్టర్ జి ఎల్ వి ప్రసాద్ వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవలను కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయ జీవన పయనాన్ని కొనసాగించిన కిల్లి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో 1912 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారని స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించారనీ తెలిపారు. గాంధీజీ పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహాంలో పాల్గొన్నారనీ ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు జరిగిన రైతు రక్షణ పాదయాత్రలో పాల్గొనీ. 1939లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభలో కీలక పాత్ర పోషించారు. 1942లో ప్రథమ ఉత్తర విశాఖ జిల్లా రైతు మహాసభను తన స్వగ్రామంలో నిర్వహించి జాతీయోద్యమాన్ని జిల్లాలో ఉడుకెత్తించారు.అని దీంతో ఆగ్రహం చెందిన బ్రిటీష్ పాలకులు, అప్పలనాయుడును నిర్భందించి….. రాజమండ్రి, తంజావూరు, రాయవెల్లూరు జైళ్లలో మూడు సంవత్సరాలు పాటు కారాగార శిక్షను విధించారు. స్వాతంత్య్ర అనంతరం కూడా అప్పలనాయుడు ఉద్యమ పంథాను వీడలేదు. రైతుల హక్కుల కోసం గళం విప్పుతూనే ఉండేవారు. 1947-48 మధ్యలో జమీందారు వ్యతిరేక ఉద్యమంలో మిలిటెంట్ గా వ్యవహరించారు. 1949లో రాజకీయ ఖైధీల హక్కు కోసం జైలు అధికారులతో పోరాటం చేశారు. 1946-51 మధ్య కాలంలో తెలంగాణలో ఉవ్వెత్తున సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని లెక్కకు మించిన సత్యాగ్రహాలు, పికెటింగ్ లు, రైతు మహాసభలు జరిపారు. స్వాతంత్య్ర అనంతరం రైతుల్లో చైతన్యం తీసుకు రావడానికి ప్రప్రధమంగా బుర్రకథ దళం ప్రవేశపెట్టారు. ఆచార్య ఎన్.జి. రంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టీకు ఉత్తర విశాఖ జిల్లా అధ్యక్షునిగా 1951లో ఎన్నికయ్యారు.1952లో శ్రీకాకుళం ద్విసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనసభకు కృషికార్ లోక్ పార్టీ తరుపున ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. జిల్లాలో తొలి చక్కెర కర్మాగారం ఏర్పాటుకు, వంశధార ప్రాజెక్టు మంజూరునకు అవిరళ కృషి జరిపారు. జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుని వ్యవహరించారు. ఎంతో ఉజ్వల రాజకీయ భవిష్యత్ ఉన్న అప్పలనాయుడు 1956 జులై 22న మరణించారు అనివారియొక్క గత సేవలను గుర్తు చేశారు.